కరీంనగర్, అక్టోబరు 2 (విజయక్రాంతి): జైలులోని ఖైదీలు క్రమశిక్ష ణతో మెలగాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం కరీంనగర్లోని జిల్లా కారాగారంలో ఖైదీల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ మాట్లా డుతూ.. శిక్ష పడ్డ వ్యక్తిలో మార్పు తీసుకువచ్చేందుకు జైలులో ప్రయత్ని స్తామన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, జిల్లా న్యాయాధికారిణి ప్రతిమ, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ట్రెయినీ ఐఏఎస్ అజయ్కుమార్ పాల్గొన్నారు.