11-03-2025 07:48:14 PM
మండల ప్రత్యేక అధికారి ప్రమీల..
నిజాంసాగర్ (విజయక్రాంతి): మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని మండల ప్రత్యేక అధికారి ప్రమీల పేర్కొన్నారు. ఆమె మంగళవారం నాడు కస్తూర్బా గాంధీ, బాలికల పాఠశాల నిజాంసాగర్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్, అచ్చంపేట పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారము భోజనము అందించాలని వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.