10-02-2025 01:46:54 PM
తాసిల్దార్ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ఉంచిన అధికారులు
ఎడు దినాలలో వివరణ ఇవ్వాలని ఆదేశం
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అర్హుల జాబితాను మహబూబ్ నగర్ అర్బన్ తాసిల్దార్ విడుదల చేశారు. పట్టణంలోని రేణిగుంట ప్రాంతంలోని 380 సర్వే నెంబర్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు గుర్తించడంలో భాగంగా అర్హులను గుర్తించి జాబితా విడుదల చేసినట్లు తాసిల్దార్ ఘాన్సీరామ్ నాయక్ తెలిపారు. మొత్తం 98 మంది వివరాలు సరిగ్గా లేవని వీరు అర్హులు కాదని అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఏడు పని దినాలలో జాబితాలోని వారు సరైన పత్రాలు తీసుకువచ్చి సమర్పించాలని తాసిల్దార్ కోరారు.