calender_icon.png 9 October, 2024 | 3:56 PM

గురుకులాల నుంచి 32 మందికి ఎంబీబీఎస్ సీట్లు

09-10-2024 02:03:42 AM

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 32 గురుకుల విద్యాలయాల నుంచి 32 మంది విద్యార్థులు నీట్ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ సీట్లను సాధించినట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణ కుమార్ తెలిపారు. సీట్లు పొందిన వారిలో హసన్‌పర్తి జూనియర్ కళాశాల, హనుమకొండ నుంచి 10 మంది, సిద్ధిపేట-3, వంగర-3, పెద్దాపూర్-1, నేరెళ్ల-ఒకరు ఉన్నారు. పోచంపాడు (బాలికలు)-1, వికారాబాద్ (బాలికలు)-2, బోధన్ (బాలికలు-1, వేలేరు (బాలురు)-2, నెక్కొండ (బాలికలు)-3, తూఫ్రాన్ (బాలురు)-1, బోరబండ (బాలికలు)-1, సర్వేలు (బాలురు) నుంచి ముగ్గరు విద్యార్థులు ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కాళాశాలల్లో సీట్లు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.వి.నర్సింహారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.