12-03-2025 12:00:00 AM
విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్
కామారెడ్డి, మార్చి 11 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యార్థి సేన ఆధ్వర్యంలో రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్ట రెడ్డి హైదరాబాద్లో మంగళవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కోర్సులు అందుబాటులో లేకపోవడం వలన విద్యార్థులు ఇతర నగరాలకు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు, దీనితో పేద విద్యార్థులకు ఆర్థిక భారం పెరిగిపోతుందని అన్నారు .
అలాగే, ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను గుర్తిస్తూ, ఈ కోర్సులు విద్యార్థులకు సమర్థవంతమైన ప్రొఫెషనల్ నైపుణ్యాలు అందిస్తాయని, ఇవి వారికి ఉత్తమ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు పవన్, సురేష్, ప్రసాద్, రిషబ్, వంశీ పాల్గొన్నారు.