11-03-2025 04:47:16 PM
విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యార్థి సేన ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్ట రెడ్డి హైదరాబాద్ లో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కోర్సులు అందుబాటులో లేకపోవడం వలన విద్యార్థులు ఇతర నగరాలకు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు.
దీనితో పేద విద్యార్థులకు ఆర్థిక భారం పెరిగిపోతుందని అన్నారు. అలాగే, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను గుర్తిస్తూ, ఈ కోర్సులు విద్యార్థులకు సమర్థవంతమైన ప్రొఫెషనల్ నైపుణ్యాలు అందిస్తాయని, ఇవి వారికి ఉత్తమ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ లో ఈ కోర్సులు పూర్తి చేసిన వారు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ, మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, అనలిటికల్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు ఉన్నాయి.
ఈ కోర్సులను కామారెడ్డి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమవుతుంది అన్నారు. విద్యార్ధుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎంబీఏ ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు పవన్, సురేష్, ప్రసాద్, రిషబ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.