కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం రోజు నగరంలోని జిల్లా గ్రంథాలయం ఆవరణలో 7 కోట్లతో నూతనంగా నిర్మాణం చేస్తున్న అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణం పనులను అధికారులతో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు తనిఖీ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ వాల రమణ రావు, సుధగోని మాధవి కృష్ణ గౌడ్ అధికారులు పాల్గొన్నారు.