15-03-2025 12:59:16 AM
ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ మార్చి 14 (విజయ క్రాంతి) : రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం అడ్డాకల్ మండల పరిధిలోని కొలువు తిరిన కందురు రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర అధునాతన హంగులతో నిర్మించిన మోడల్ కమ్యూనిటీ హాల్ను ఎంపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ. 7 లక్షల ఎంపీ నిధులలో మోడల్ మల్టి పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే తరహా మోడల్ కమ్యూనిటీ హాల్స్ త్వరలో పార్లమెంటు అంతటా దశల వారీగా నిర్మిస్తామని తెలిపారు. భక్తులు ఈ కమ్యూనిటీ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, బిజెపి నాయకులు ఉన్నారు.