ఎల్బీనగర్, ఫిబ్రవరి 4 : సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మౌలానా ఏఎస్త్స్రగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీఐ సైదిరెడ్డి, సహోద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మౌలానా మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ.. తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే పదోన్నతి పొందడం ఆనందంగా ఉన్నదన్నారు. తన కర్తవ్యం లో మరింత బాధ్యత కలిగి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.