కొత్తగూడెం: సింగరేణి, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. నిరుద్యోగుల నుంచి నిందితులు రూ.4 కోట్లు వసూలు చేశారు. ఉద్యోగాలు కల్పించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాసు హరీశన్, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు.