ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ఉన్నతస్థాయి దర్యాప్తుకు సీఎం షిండే ఆదేశం
ముంబై, అక్టోబర్ 6: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బెం బూర్లోని ఓ రెండు అంతస్థుల భవనంలో ఆదివారం మంటలు చెలరే గాయి. ప్రమాదంలో ఒకే కుటుంబాని కి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారు లు కూడా ఉన్నారు. స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారని అధికారులు వెల్లడించారు.
ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు వచ్చి అవి క్రమంగా మొద టి అంతస్తుకు వ్యాపించాయని పేర్కొన్నారు. ఆ సమయంలో వారు గాఢ నిద్రలో ఉండటంతోనే ప్రాణనష్టం అధికంగా జరిందని తెలిపారు. మృతు ల కుటుంబ సభ్యులను సీఎం ఏక్నాథ్ షిండే పరామర్శించారు. ఒక్కో మృతు డి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి చికిత్సకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని వెల్లడించారు.