శేరిలింగంపల్లి (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్(Chandanagar Police Station) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్(Lingampally Railway Station) ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గరలో గల పూరి గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే స్థానికులు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.