calender_icon.png 7 October, 2024 | 9:38 PM

భారీగా గంజాయి పట్టివేత

07-10-2024 07:38:18 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం వద్ద సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆటోలో తరలిస్తున్న 45 కిలోల గంజాయి పట్టుబడినట్లు అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే... గొల్లగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానస్పదంగా వస్తున్న టిఎస్19టి8877  ఆటోను ఆపి పరిశీలించగా సుమారు 45 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్ ఆకుల శివ కుమార్ తోపాటు ఆటోను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు సిఐ అశోక్ రెడ్డి పేర్కొన్నారు.