12-02-2025 04:55:21 PM
కొండపాక (విజయక్రాంతి): శ్రీ భగవాన్ సత్య సాయి భజన మండలి సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో శ్రీ భగవాన్ సత్య సాయి భజన మండలి సామూహిక సత్యసాయి వ్రతాలు బుధవారం 100 మంది సభ్యులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాద సేవలో పాల్గొన్నారు. భజన మండలి అధ్యక్షుడు నందకిషోర్ శర్మ, గౌరవ అధ్యక్షులు హరిబాబు, జిల్లా అధ్యక్షులు నరసింహులు, జిల్లా కన్వీనర్ బాల నరసయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.