calender_icon.png 30 September, 2024 | 10:05 PM

మియాపూర్ సీబీఆర్‌ ఎస్టేట్‌లో దారుణం

30-09-2024 07:08:34 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన మరీ హత్య..?

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే ఓ మహిళ దారుణంగా హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్ లోని సీబీఆర్‌ ఎస్టేట్ లో స్పందన(29) అనే వివాహిత భర్తతో గొడవల కారణంగా ఒంటరిగా నివసిస్తోంది. గత కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో ఉండగా సోమవారం గుర్తు తెలియని దుండగులు ఆమెను దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.