calender_icon.png 27 September, 2024 | 3:05 PM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య

26-09-2024 06:05:09 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సంఘటన కామారెడ్డి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన చాకలి సాయవ్వ(25) అనే యువతి అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతిని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ సాయవ్వ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు . సాయవ్వ భర్త సాయిలు బతుకుతెరువు కోసం అప్పుచేసి గల్ఫ్ దేశానికి వెళ్లారు. సాయవ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను పోషించలేని స్థితిలో ఆమె రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సాయిలు గల్ఫ్ నుంచి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించమని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.