నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జెట్ ప్రోలు గ్రామానికి చెందిన సులిగురి ఉషమ్మ వెంకటయ్య దంపతుల కుమార్తె ప్రహర్ష నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించింది. దీంతో ప్రహర్షకు నారాయణపేట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులో ఉండడంతో వెంకటయ్య తమ కుమార్తెను చదివించి తనకు మంచి భవిష్యత్ ను ఇవ్వాలని ఉంది. కానీ, తన కుమర్తెను వారి ఆర్థిక ఇబ్బందులతో చదివించలేకపోతున్నా అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అది చూసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రహర్ష కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీసి, విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించాడు. విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు అభినందించాడు. తను ఎంబీబీఎస్ చదవడానికి మా ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా మొదటి సంవత్సరం ఫీజు రూ.75 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువు పూర్తి అయ్యే వరకు ఇంకా మూడు సంవత్సరాల ఫీజు మా ట్రస్ట్ ద్వారానే చెల్లిస్తామని మర్రి జనార్ధన్ రెడ్డి అమ్మాయికి భరోసా ఇచ్చారు.