25-03-2025 05:40:21 PM
మంచిర్యాల (విజయక్రాంతి): నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ, దుర్గామాత దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చిప్ప రాజబాబు, తౌటం మల్లేష్, కుంట రామన్న, ఆడేటి రాజన్న, మెండె వెంకన్న, కుందారపు రాములు, కుందారపు రమేష్, సాంబయ్య, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.