calender_icon.png 29 September, 2024 | 9:10 PM

వివాహిత ఆత్మహత్య

28-09-2024 12:00:00 AM

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27: కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడిని భరించలేక ఓ మహిళ ఆత్మహ త్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సాయి సింధు (29) మియా పూర్ మయూరి నగర్‌లో భర్త, కుమారుడితో  కలిసి నివాసం ఉంటోంది.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయిసింధుకి భర్తతోనూ గొడవ లు జరుగుతుండటంతో మానసిక ఆం దోళనతో శుక్రవారం తాను ఉంటు న్న దివ్యశక్తి అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మ్రుతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.