29-03-2025 02:13:04 AM
మహబూబాబాద్ మార్చి.28: (విజయ కాంతి )మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయబడిన ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు (1,28,29,400/-) విలువైన 513 కేజీ 176 గ్రాముల గంజాయిని మహబూబాబాద్ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు.కాకతీయ మెడిక్లీన్ ఏజెన్సీ, ఊర్సుగుట్ట, హన్మకొండలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మరియు మాధకాడ్రావ్యాల నిరోధక శాఖ ఆదేశాలమేరకు డ్రగ్ డిస్పోసల్ కమిటీ సభ్యుల సమక్షంలో గంజాయి దహనం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గండ్రతి మోహన్,టౌన్ డిఎస్పీ తిరుపతి రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, గూడూరు సీఐ సూర్య ప్రకాష్, మరిపెడ సీఐ రాజకుమార్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసులు గత కొంతకాలంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో పట్టుపడి 9 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని జిల్లా మద్దకద్వావ్యాల నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, యువతను డ్రగ్స్ మాయలోకి దూరనీయకుండా అవగాహన కార్యక్రమాలు, కఠినమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఎవరైనా మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం గురించి సమాచారం అందిస్తే ఆ వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.