calender_icon.png 25 September, 2024 | 9:58 AM

కోటి విలువైన గంజాయి స్వాధీనం

25-09-2024 01:25:25 AM

పది మంది నిందితుల అరెస్టు

భద్రాచలం, సెప్టెంబర్ 24: భద్రాచలంలో ఒకే రోజు ఐదు సంఘటనల్లో రూ.కోటి విలువగల 319 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10మం ది నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధ న్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కు చెందిన నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్, ఫతేనగర్, బాలనగర్‌కు చెందిన శక్తి రాహూల్, గోపిశెట్టి అక్షిత్, మునార్‌లీ, దత్తు పంచాల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు.

వీరిలో నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్ తల్లీకొడుకులు. అపర్ణ భర్త సదయ్య కొన్ని రోజుల క్రితమే గంజాయి రవాణా కేసులో జైలు పాలయ్యాడు. ఇప్పుడు అతడి భార్య, కుమారుడు గంజయి రవాణ చేస్తూ ఎక్సైజ్ అధికారులకు చిక్కారు. వీరిపై మూడు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. వారి నుంచి రెండు కార్లు, మూడు బైక్‌లు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.