18-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రి ల్ 17(విజయక్రాంతి) : నగరంలో ని ధూల్పేట్, జియాగూడలో ఎక్సై జ్ ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు ని ర్వహించారు. ధూల్పేట్ రాణి అవంతిబాయ్ విగ్రహం సమీపంలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి గం జాయిని తీసుకొస్తున్న ఆకాశ్సంగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 25.23కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జియాగూడ పీలా కాశీ శివ మందిర్ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం తో ఎస్టీఎఫ్తనిఖీలు నిర్వహించా రు. గంజాయి విక్రయిస్తున్న భద్రినారాయణ్ సింగ్ను అరెస్ట్ చేసి అతని నుంచి 1.5కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు.