హైదరాబాద్సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మేడ్చల్లోని కేఎల్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటున్న విద్యార్థుల గదిలో శనివారం ఉద యం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ ఏ సుభాశ్ చందర్రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి 1.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అద్దె భవనం లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రఘుపతి, త్రినేత్ర అనే విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సీలేరు నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు.