calender_icon.png 7 October, 2024 | 11:49 PM

గంజాయి పట్టివేత

06-10-2024 12:00:00 AM

ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 36లోని డౌన్‌టౌన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు శుక్రవారం నిర్వహించిన దాడుల్లో రూ.2 లక్షల విలువైన 3.230 కిలోల గంజాయి, 34 గ్రాముల ఓజీకుష్(ఓసియన్ గ్రో గంజా)ను పట్టుకున్నారు. ఎస్‌టీఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ తన బృందంతో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో వరంగల్‌కు చెందిన దుర్గ్యా ల రాజ్‌కుమార్, పాత వర్షిత్, సూర్య ను అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్న ఖమ్మంకు చెందిన దాండి దీపక్‌కుమార్, తుమ్మల భాను తేజారెడ్డి అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.