calender_icon.png 26 October, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టివేత

22-07-2024 01:43:21 AM

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

రంగారెడ్డి, జూలై 21 (విజయక్రాం తి) : చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లిలో ఆదివారం గంజాయి రవాణా చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 5.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపారు. బీడీఎల్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఇద్ద రు వ్యక్తుల వద్ద గంజాయి ఉందన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా వారి బ్యాగులో 5.5 కేజీల గంజాయి లభించింది. ఒడిషా రాష్ట్రానికి చెందిన మాణిక్య మజ్హి అనే వ్యక్తి వద్ద నుంచి భీమల్‌నాయక్, ఉమేశ్ మజ్హిలు తక్కువ ధర కు గంజాయి కొనుగోలు చేసి శంకర్‌పల్లిలోని అరుణ్ అనే వ్యక్తికి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులో తీసుకు న్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.