ఛత్తీస్గఢ్: దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ లో నిన్నటి ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ మరో 3 మృతదేహాలను గుర్తింపుతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది. ఎన్కౌంటర్లో మృతుల వివరాలను వెంటనే ప్రకటించాలని ఏపీ పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు మృతుల్లో వావోయిస్టు కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మృతుల ఫోటోలు, వివరాలు స్పష్టంగా పోలీసులు విడుదల చేయాలని కోరారు.