మంథని,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా మంథని పురపాలిక కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామిని సీడీఎంఏ కార్యాలయానికి ప్రభుత్వం సరెండర్ చేసినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో మంథనిలో గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ, నాటకీయ పరిణామాల నేపథ్యంలో కమిషనర్ పై పాలకవర్గం సభ్యులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. కమిషనర్ ఒంటెద్దు పోగోడాలపై పాల్కవర్గం సభ్యులు కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఈ సందర్భంగా నే కమిషనర్ ను సరెండర్ చేసినట్లు మంథని పట్టణంలో చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కమిషనర్ పై ఇంకెన్ని ఆరోపణలు వస్తాయో వేచి చూడాలి!