- మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు
- పట్టణంలోని పూరతన ఆలయంలో పూజలు
మంథని, సెప్టెంబర్ 16: పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం మేధావుల గడ్డ అని, మంథనిలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని భిక్షేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, మహాలక్ష్మి, శీలేశ్వర, గౌతమేశ్వర స్వామి, సీతారామ, బాల సరస్వతి ఆలయాల్లో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. మంథనికి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ జర్నిలిస్టు, క్రికెట్ కామెంటేంటర్లు మహావాది సుధీర్, విజయకుమార్ల తల్లి సరోజినీ దేవి ఇటీవల మృతి చెందారు. వారిని వెంకటపతిరాజు పరామర్శించారు. ఆయనవెంట మంథని మున్సిపల్ చైర్మన్ రమాదేవి, కౌన్సిలర్ హనుమంతరావు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు.