calender_icon.png 12 October, 2024 | 9:52 AM

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని గౌడ సంఘం నాయకులు

11-09-2024 10:19:24 AM

మంథని (విజయక్రాంతి): ఇటీవలే నూతన మంథని గౌడ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన తాటి బాలయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంథని గౌడ సంఘం నాయకులు హైదరాబాద్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వం కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు మాచిడి రవితేజ గౌడ్, మాచిడి సత్యనారాయణ గౌడ్, తాటికొండ రాజు గౌడ్, ఆరేల్లి కిరణ్ గౌడ్. తాటి సమ్మయ్య గౌడ్, పొన్న మోహన్, పొన్నం చంద్రయ్య, కమ్మ గోని శంకర్ గౌడ్, తాటి శ్రీధర్ గౌడ్, కొండ్ర రాజయ్య గౌడ్, మాచిడి లింగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.