రాజాపూర్, సెప్టెంబర్౧౯ : మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ పరిధి లోని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి చో టు చేసుకుంది. ఎస్సై తిరుప్పాజీ తెలిపిన వివరాల ప్రకారం.. బాలనగర్ మండలంలోని పెద్దయపల్లి కి చెందిన వడ్డె పర్వతాలును బాలనగర్ చౌరస్తా సమీపంలోని ఓ వెం చర్లో గుర్తు తెలియని వ్యక్తులు బం డ రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ జా నకి పరిశీలించారు. మృతుడి భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.