జలమండలి ఎండీ అశోక్రెడ్డి
హైదరాబాద్సిటీబ్యూరో, అక్టోబర్ 15(విజయక్రాంతి): మహానగర పరిధిలో ధ్వంసమైన మ్యాన్ హోళ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని జలమండలి ఎండీ అశోక్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఓఅండ్ఎం 10, 11 పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఓల్డ్ నాగోల్ విలేజీలో సీవరేజ్ లైన్లను పరిశీలించారు. రెయిన్ వాటర్ డీ సిల్టింగ్ పనులు చేపట్టకపోవడంతో మురుగు రోడ్లపైకి వస్తున్నట్లు గుర్తించారు.
వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. మూసీలోని సీవరేజీ ట్రంక్ మెయిన్కి దానిని అనుసంధానం చేయాలని సూచించారు. పైప్లైన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలన్నారు. అనంతరం ఎల్బీనగర్లోని వాస్తుకాలనీ, హోటల్ స్వాగత గ్రాండ్ పరిసరాల్లో ఆయన పర్యటించారు. పర్యటనలో డైరెక్టర్ స్వామి, సీజీఎం నాగేందర్, జీఎంలు, డీజీఎంలు ఉన్నారు.