15-04-2025 01:07:58 AM
యాచారం ఎప్రిల్ 14: మండలం లోని ఆయా గ్రామాలలో సోమవారం సాయం త్రం కురిసిన వడగళ్ల వర్షానికి వివిద రకాల పంటలు దెబ్బతిన్నాయి. మేడిపల్లి గ్రామం లో భారీవర్షంతో పాటు వడగళ్ల వాన కురుసింది.ఈ వర్షానికి మామిడి తోటలు బాగా దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వర్షం కురియడంతో పంట నేలరాలి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.ఈ సారి మామిడి కాత అంతంతమాత్రంగానే ఉంది.కాసిన కొద్దిపాటి మామిడికాయలు వడగళ్ల వర్షానికి పంటలు కూడా దెబ్బతిన్నాయి. గ్రామాలలో పంటల నష్టం అదికం గా ఉంది.పంటలు దెబ్బతిన్న గ్రామాలలో అదికారులు పర్యటించి పంట నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలని అదికా రులను కోరుతున్నారు.