11-03-2025 11:12:16 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో మంగళవారం పల్లె ప్రకృతి వనాన్ని మండల ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లు ఎండిపోకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషరుద్దిన్ ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.