04-04-2025 10:51:27 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీలను నిజాంసాగర్ మండల ప్రత్యేక అధికారి ప్రమీల పరిశీలించారు. కూలీలకు నీడ వసతి తో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమేవెంట పంచాయతీ కార్యదర్శి తుకారం స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.