20-03-2025 08:47:36 PM
మోతె: పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రం ఏర్పాట్లను పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి గోపాలరావు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ నెల 21 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. మోతె మండల కేంద్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల్లో 134 మంది పరీక్షకు హాజరు కాబోతున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.