calender_icon.png 10 October, 2024 | 4:55 PM

ముఖ్యమంత్రి మాటలు నమ్మే పరిస్థితి లేదు: మంద కృష్ణ

10-10-2024 02:19:12 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకూ వర్గీకరణ చేస్తామన్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ అమలు చేయకుండానే టీచర్ పోస్టుల భర్తీ చేశారని ఆరోపించారు. గ్రూప్-1 పోస్టులకూ వర్గీకరణ వర్తింపజేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. వర్గీకరణ తర్వాతే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని కోరారు. వర్గీకరణ తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణ జరిగే వరకు పరీక్షలు మరో 2 నెలలు ఆపండన్నారు. వర్గీకరణ చేయకుండా పరీక్షలు నిర్వహిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.