హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ సరస్సు సమీపంలోని వెంకట్రామ్ కాలనీలో శనివారం రాత్రి 50 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పోచయ్యగా గుర్తించామని, అతడిని ధర్మేంద్ర 100 రూపాయల కోసం హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేయబ డింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శపపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.