హైదరాబాద్,(విజయక్రాంతి): డబ్బుల విషయంలో ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైది విధించింది. వివరాల్లోకి వెళితే... 2020లో రంగారెడ్డి జిల్లా కాసులాబాద్ కు చెందిన రాజును అంజయ్య అనే వ్యక్తి డబ్బుల విషయంలో గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం రాజు మృతదేహాన్ని అంజయ్య మోయలేక కత్తితో మూడు ముక్కులు చేశాడు. ఈ కేసుపై సోమవారం విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడు అంజయ్యకు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధించింది.