calender_icon.png 20 April, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

11-04-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం ,ఏప్రిల్ 10 (విజయక్రాంతి): పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గారు గురువారం తీర్పును వెల్లడించారు.

కేసు వివరాలు ఇలా... ఇల్లందు మండలం తంగేళ్లగడ్డకు చెందిన భూక్య నాగేశ్వరరావు అలియాస్ నగేష్ తన బంధువు కుమార్తెలయిన ఆరు సంవత్సరాల బాలికను,నాలుగు సంవత్సరాల బాలిక చెల్లెలు ఇద్దరిని చాక్లెట్ ఇస్తానని చెప్పి 2024, జులై 4న తన ఇంట్లోకి తీసుకొని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడగా వారి అరుపులకు నాగేశ్వరరావు పారిపోయినాడు. ఇట్టి విషయమై బాలిక తండ్రి 2024 జూలై 5న ఇల్లందు పోలీసు వారికి ఫిర్యాదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేయడమైనది.

అప్పుడు ఇల్లందు డిఎస్పి ఇన్చార్జిగా వ్యవహారిస్తున్న  కొత్తగూడెం డిఎస్పి  ఎస్కే.అబ్దుల్ రెహమాన్ విచారణ చేపట్టినారు.తదనంతరం ఇల్లందు డిఎస్పి చంద్రబాను గారు ధర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినారు. ప్రాసెక్యూషన్ తరఫున కోర్టులో 15 మంది సాక్షులను విచారించారు.ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరము గౌరవ జడ్జి భూక్యా నాగేష్ @ నాగేశ్వరరావు పై నేరం రుజువు అయినందున అతనికి జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా  విధిస్తూ తీర్పును వెల్లడించారు.

ఇట్టి కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా కృషిచేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, ఇల్లందు సీఐ సత్యనారాయణ , స్పెషల్ పబ్లిక్ ప్రాసి క్యూటర్ వెలగల నాగిరెడ్డి,అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి,భరోసా సెంటర్ కొత్తగూడెం లీగల్ ఆఫీసర్ గద్దాడ శిరీష, కోర్ట్ నోడల్ ఆఫీసర్ ఎస్త్స్ర జి.ప్రవీణ్ కుమార్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఘని,కోర్టు డ్యూటీ ఆఫీసర్ తాళ్లూరి శ్రీనివాసరావు లను  ఎస్పీ రోహిత్ రాజు  ప్రత్యేకంగా అభినందించారు.