కామారెడ్డి (నిజామాబాద్), అక్టోబర్ 18 (విజయక్రాంతి): పైనాన్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నిజామాబాద్లో చోటుచేసుకుంది. నగ రంలోని నెహ్రూనగర్కి చెందిన షేక్ ఖయ్యూమ్ (48) మూడేళ్ల క్రితం ఓ ప్రైవేట్ పైనాన్స్లో ఇంటిపై రుణం తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఖయ్యూమ్ పక్షవాతం బారిన పడ్డాడు.
పైనాన్స్ రికవరీ ఏజెంట్లు కీస్తీల కోసం వేధించడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ నెల 16 న ఇంటి నుంచి వెళ్లి పోయిన ఖయ్యూం.. అశోక్సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పులు, దుస్తులను చూసి గుర్తుపట్టి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.