calender_icon.png 24 October, 2024 | 2:01 AM

శ్రీశైలం దర్శనానికి వెళ్లి.. పాతాళ గంగలో వ్యక్తి గల్లంతు

02-08-2024 09:47:46 AM

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): శ్రీశైలం దర్శనానికి వెళ్లిన వ్యక్తి పాతాళ గంగ వద్ద స్నానం చేస్తూ వరద తాకిడికి కొట్టుపోయాడు ఈ ఘటన శుక్రవారం శ్రీశైలం డ్యాం పాతాళ గంగ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య తన తోటి స్నేహితులతో కలిసి శ్రీశైలం దర్శనానికని వెళ్ళాడు. ఏ క్రమంలో పాతాళ గంగ వద్ద స్నానం చేసేందుకు కిందికి దిగడంతో వరద తాకిడికి గురై వ్యక్తి గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు.