చేగుంట, ఫిబ్రవరి 12 : మెదక్ జిల్లా మసాయిపేట్ పట్టణ కేంద్రంలో గల ప్రకృతి వైన్స్ పక్కన కొల్చారం గ్రామానికి చెందిన శంకర్ (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు, శంకర్ గత రెండు సంవత్సరాల నుండి చిన్న శంకరంపేట్ మండలం ధరిపల్లి గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవించేవాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి రామయంపేట్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వగా బుధవారం ప్రకృతి వైన్స్ లో తనిఖీలు నిర్వహించారు.