calender_icon.png 8 October, 2024 | 7:45 PM

మద్దిరాలలో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి.

08-10-2024 04:33:09 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో పొలంలో మందు పిచికారి చేస్తుండగా కరెంటు తీగలు తగిలి విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దిరాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల గ్రామానికి చెందిన భూతం వెంకన్న చిన్న కుమారుడు భూతం కృష్ణ (25) మృతితో గ్రామంలో, విషాదఛాయలు అలుముకున్నాయి.