calender_icon.png 5 October, 2024 | 2:48 PM

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

05-10-2024 11:35:50 AM

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామంలో శుక్రవారం రాత్రి కరెంట్ షాక్ తో చందు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. తన ఇంటి ముందు వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా మురికి కాలువలో చిత్తచెదారాన్ని తొలగించే క్రమంలో పక్కనే ఉన్న కరెంట్ స్తంభం చెయ్యి తాకడంతో షాకుకు గురయ్యాడు ‌. కరెంట్ షాక్ తో స్పృహ తప్పి కింద పడి పోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం బీదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించి, మృతి చెందినట్లు తెలిపారు. హద్నూర్ పోలీసులు శనివారం బీదర్ ఆస్పత్రిని సందర్శించి ఘటన వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.