calender_icon.png 29 April, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

29-04-2025 12:56:36 AM

కామారెడ్డి, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి),కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన బొట్ల సంజీవ్ (35) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజీవ్ ను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి కి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు.

డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్న బొట్ల సంజీవ్ ఎప్పటి మాదిరిగానే కామారెడ్డిలో డీసీఎం పెట్టి బైక్ పై  ఇసాయిపేట  గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో కామారెడ్డి -సిరిసిల్ల రహదారిపై ఉగ్రవాయి మైసమ్మ వద్ద గూడ్స్ ఆటోను వెనుక నుండి ఢీకొట్టడంతో  తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్పందించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబా దులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, కుమారుడు ,కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.బొట్ల  సంజీవ్ మృతి పట్ల గ్రామం శోక సంద్రంలో మునిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సు రాజు తెలిపారు.