22-03-2025 12:07:56 AM
ఇబ్రహీంపట్నం,(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మృతి చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదారాబాద్ నుండి కేటిఏం బైక్ పై ఇద్దరు వ్యక్తులు రావిర్యాలకు వెళ్తుండగా ఏసిసి ప్లాంట్ సమీపంలోకి చేరుకోగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూలమలుపు వద్ద అదుపుతప్పి గోడను డి కొట్టిన బైకిస్ట్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ హయత్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.