calender_icon.png 23 September, 2024 | 11:53 AM

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

23-09-2024 01:10:47 AM

చేవెళ్ల, సెప్టెంబర్ 22: అడవి పందుల నుంచి రక్షణగా మొక్కజొన్న చేను చుట్టూ పెట్టిన విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తి షాక్ కొట్టి చనిపోయాడు. ఎస్సై సంతోష్ రెడ్డి కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామానికి చెందిన నల్లోళ్ల రాజు(35) మూడు రోజుల కింద ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా, ఆదివారం అదే గ్రామానికి చెందిన చేవెళ్ల కిష్టయ్య మొక్కజొన్న చేను చుట్టూ పెట్టిన కరెంట్ వైర్ తగిలి రాజుకు కిందపడ్డాడని తల్లి పోచమ్మకు సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే పెద్ద కొడుకు జంగయ్యను తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లి చూడ గా రాజు చనిపోయి కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, రాజుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.