08-04-2025 12:00:00 AM
చేగుంట, ఏప్రిల్ 7: చిన్నశంకరంపేట మండల పరిధిలోని కామారం రైల్వే గేట్ వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృ తి చెందినట్లు కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హనుమాన్డ్లు గౌడ్ తెలిపారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత్యు దేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని, ఎవరైనా శవాన్ని గుర్తు పట్టినట్లయితే కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.