31-03-2025 01:21:25 AM
దౌల్తాబాద్, మార్చి 30 : రామాయంపేట కెనాల్ కాలువలో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇందుప్రియల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా మచ్చనూర్ గ్రామానికి చెందిన ఇర్బ ఎడకే(45) తన భార్య పిల్లలతో రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది కనకరాజు ఇటుక బట్టీలో కూలీ పని కోసం రెండు నెలల క్రితం వచ్చాడు.
ఉదయం రామయంపేట కెనాల్ కాలువలో స్నానానికి వెళ్లి నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య చందర్ బాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.