రామాయంపేట (మెదక్), సెప్టెంబర్ 17: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామాయంపేట మండలం గొల్పర్తి గ్రామానికి చెందిన వెంకటాపురం శివరాములు(39) తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో శివరాములు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు రైల్వే ఎస్ఐ తౌర్యనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.